“మీరు ఎప్పుడొస్తారో ఏమోకాని, నేనుమాత్రం మీదగ్గరకే బయలుదేరి రావటానికి రెడీ అయి ఉన్నాను”
“ఆ…..వద్దు వద్దు, నీవిక్కడికి రావద్దు రెడ్డీ ! నేనే అక్కడకు వస్తున్నాను”
“ఆ….నిజమా దొరా ? ఈరోజు అనుకోకుండా నామీద దయ కలిగిందనుకుంటాను”
“నీమీద దయకాదు రెడ్డీ ! ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారమే మీ వూరు వస్తున్నాను.నిన్నటివరకు కోస్తాజిల్లాలలో సరిపోయింది.ఈరోజు నుండి తెలంగాణ జిల్లాలు తిరగాలి”
“ఇప్పట్లో ఎలెక్షన్స్ లాంటివి లేవుగా ? ఎందుకంతగా కష్టపడతారు?”
“పనిలేక.అయినా మా సి ఎమ్ కి బుద్దిలేదు రెడ్డీ.ఆకస్మిక దాడుల పేరున ఎంప్లాయస్ ని ఇబ్బందిపాలు చేస్తున్నాడు.”
“అయితే మీరు వస్తున్నదికూడా అందుకేనా?”
“అవును.ఎవరితోనూ ఈ విషయం చెప్పకు.ఇవాళ రేపు మీ జిల్లాలలో ఉంటాను.ఈ రోజు కొన్ని కీలకమైన కార్యాలయాలను తనిఖీ చేయాలి.నేనింకో పదినిమిషాల్లో బయలుదేరుతున్నాను.నీవు అక్కడే గెస్ట్ హౌస్ లో ఉండు”
“అలాగే”
“ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను.పెట్టేయమంటావా?”
“తమరి దయ”
“నా దయ ఏముంది రెడ్డీ ? నీ దయే నామీద ఉండాలి.నీ వలపు పొందులో నలుగుతున్న పంతులమ్మని ఒకసారి దయచూపాలి”.
“తప్పకుండా చూపిస్తాను దొరా ! అసలు నేను రాజధానికి బయలుదేరి వచ్చేది పంతులమ్మకి సంబంధించిన ఓ విషయం గురించి చర్చించటానికే!”
“అయితే ఇంకేం? నేనెక్కడికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మాట్లాడుకుందాం.ఇక ఉంటా” అంటూ అవతలినుండి రిసీవర్ ని పెట్టేసినట్లుగా క్లిక్ మని శబ్దం వినిపించింది.
వెతకబోయిన తీగె కాలికి తగినట్లుగా ఫీలవుతూ సంతోషంకొద్ది రిసీవర్ ని పెట్టేసి తృప్తిగా బయటకు నడిచాడు బిక్షంరెడ్డి.అప్పటికే రెడీగా ఉన్న డ్రైవర్ తన యజమాని వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోగానే తనూ డ్రైవింగ్ సీటులో కూర్చొని ఇంజిన్ స్టార్ట్ చేసాడు.
మంత్రిగారి రాకని గురించి ఎవరెవరికి సమాచారం ఇవ్వాలో ఆలోచిస్తూ జీపుని పోనివ్వమన్నాడు బిక్షంరెడ్డి.
మధ్యాహ్నం పన్నెండుగంటల పదినిమిషాలకు మంత్రి పశుపతి లింగంపల్లికి వచ్చాడు.గెస్ట్ హౌస్ లో దిగి లంచ్ కార్యక్రమాన్ని ముగించుకున్నాడు.విశ్రాంతి తీసుకొనే ప్రయత్నం చేయకుండా మండలస్థాయి నాయకులందరినీ కలుసుకొని మాట్లాడాడు.
గ్రామ,మండలస్థాయి సమస్యల్ని గురించి…..
గ్రూప్ రాజకీయాల గురించి చాలా వివరాలను సేకరించాడు.
సమస్యల పరిష్కారం కొరకు ఒక సమగ్ర నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తానని హామీ ఇచ్చి వచ్చినవారినందరినీ పంపించి వేసాడు.మధ్యాహ్నం మూడుగంటలవరకు బిజీగా గడిపాడు.తరువాత ఫ్రెష్ గా తయారై భిక్షంరెడ్డిని, మరో ఇద్దరు ముఖ్యమైనవారిని వెంటపెట్టుకొని వెళ్లి ఎమ్ ఆర్ ఓ కార్యాలయాన్ని , విద్యుత్ , ఇరిగేషన్ , రహదారులు భవనములు , హాస్పిటల్ మొదలగు శాఖలన్నింటిమీద అకస్మిక దాడులు చేసి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలుచేసి కుర్చీల్లో ఉండకుండా స్వంత పనులు చూసుకోవటానికి వెళ్లిన పలు ఉద్యోగుల్ని అప్పటికప్పుడే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేశాడు.ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టించాడు.
ముక్కుమీద వేలేసుకున్నారు మండలస్థాయి ఉద్యోగులందరూ.ఇకపైన ఉదయంనుండి సాయంత్రంవరకూ కూర్చున్న సీటుని వదలకుండా కూర్చోవాలన్న నిర్ణయానికి వారు వచ్చేలాగా ప్రవర్తించాడు పశుపతి.
తరువాత రంభ పనిచేస్తున్న స్కూలుకి బిక్షంరెడ్డి కోర్కెపై వెళ్ళాడు.
వాళ్లక్కడకు వెళ్లేసరికి స్కూల్ వదిలారు.పిల్లలందరూ వెళ్ళిపోతూ కనిపించారు.రంభతోపాటుగా ముసలి పంతులుకూడా ఇళ్ళకి వెళ్లిపోవుటకు సిద్ధమవుతుండగా కారువచ్చి అక్కడ ఆగేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళు.
కారుదిగిన బిక్షంరెడ్డి , మంత్రి పశుపతిగారికి స్వాగతం పలికి స్కూల్లోకి తీసుకెళ్లాడు.బిక్షంరెడ్డిని అడిగి తెలుసుకున్నారు వచ్చింది మంత్రి పశుపతిగారన్న విషయాన్ని.
అటెండెన్సు రిజిస్టర్ని , పిల్లల ప్రగతి తెలిపే రిజిస్టర్ ని తనిఖీచేసి వెరీగుడ్ అని సర్టిఫికెట్ రాసి సంతకం చేశాడు.
అప్పటివరకు రంభని పూర్తిగా గమనించని పశుపతి పెన్ను అందిస్తున్న ఆమె చేతిస్పర్శ తగిలేసరికి గబాల్న తలెత్తి చూసాడు.
అందమైన ముఖంతో కనిపించే వెలుగు అతని గుండెల్లో దూసుకుపోగా,
అపురూపమైన ఆమె వక్ష సంపదని……
మందారపువ్వుని పోలిన ఆమె లోతైన బొడ్డు అందాన్ని చూస్తూ గుటకలు మ్రింగాడు.మైకంతో మతిపోగొట్టుకొని రంభని ఎలాగైనా అనుభవించాలన్న నిర్ణయానికి వచ్చాడు.అంతలోనే కర్తవ్యం గుర్తుకువచ్చి గబగబా సంతకాలు పెట్టడం పూర్తిచేసి బయలుదేరాడు.
అతనితోపాటుగా బిక్షంరెడ్డి తదితరులు వెల్లి కారులో కూర్చున్నారు.
కారులో కూర్చుంటూనే రాత్రికి వస్తానన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు బిక్షంరెడ్డి.
సన్నగా నవ్వింది రంభ.
వెళ్లిపోతున్న కారువేపు చూస్తున్న రంభకి మంత్రి పశుపతి మీద ద్యాసమళ్లింది.
తక్కువ వయసులోనే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగాడు ఇతను?
వయసు ఎంతఉన్నా చెక్కు చెదరని అందం…..
వడ్డు పొడుగుకి తగిన పర్సనాలిటీ…..
విశాలమైన ఛాతీనిండా దట్టంగా చిన్నసైజ్ అడవిలాగా ఎంత బావున్నాయో వెంట్రుకలు?
ఒకవిధంగా చెప్పాలంటే బిక్షంరెడ్డి కంటే మంత్రిగారే బావున్నాడు.
అందంగా…..
బలంగా…..
అదో కోరికగా…..
అబ్బ…..ఇలాంటివాడిచేత ఒకసారి పడుకున్నాచాలు. జన్మ ధన్యం అవుతుంది.
కానీ…..
ఎలా వీలవుతుంది?
భిక్షంరెడ్డంటే ఇక్కడే ఉండేవాడు కాబట్టి సరిపోయింది.
మంత్రిగారు రాజధానిలో ఉంటాడు.
పైగా అనుక్షణం ప్రతిపక్ష నేతల కళ్ళు వెంటాడుతుంటాయి.
చిల్లరగా వ్యవహరిస్తే వారి పరువుపోయే అవకాశముంది.
కనుక అతన్ని ఊహల్లో బంధించుకొని భిక్షంరెడ్డినే అతనిగా భావించుకొంటూ సరిపెట్టుకోక తప్పదు.అని ఆలోచిస్తూ చాలాసేపు అలాగే నిల్చుండిపోయింది రంభ.
ముసలి పంతులుగారి పిలుపుపై అక్కడినుండి కదిలిపోక తప్పలేదు రంభకి.
ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న మంత్రి పశుపతి మనసు మనసులో లేదు.
ప్రతిక్షణం రంభ అందం ముఖ్యంగా ఆమె వక్షసంపదలో కనిపించే గట్టితనం,మెరిసిపోతూ కండలు తిరిగిన శరీరం, అతని కళ్ళముందు కదలాడుతూ ఊపిరి పీల్చుకోలేనంత గుబులు ఏర్పడ్డది అతని మనసులో.
అతని మగసిరి నిద్దుర మేల్కొంది.
ఊరకే ఉండలేక….”భిక్షంరెడ్డి ఈరోజు రాత్రికి ఆ పంతులమ్మ కావాలి నాకు.నీవెలా మేనేజ్ చేసుకుంటావో నాకనవసరం.రాత్రికి మాత్రం తప్పకుండా ఎరేంజ్ చేయ్” అన్నాడు.
“ఆమె ఒప్పుకుంటుందో లేదో”
“వప్పుకున్నా వప్పుకోకపోయినా ఆమె నాక్కావాలయ్యా. నీ తంటాలు నువ్వుపడు” కసురుకున్నాడు పశుపతి.
“సాధ్యమైనంతవరకు ట్రై చేస్తాను”
“ట్రై చేయటానికి మెజారిటీలేని కలగూర గంపలాంటి పార్టీలము కాదయ్యా మనం.కారులో ఉంది ఐదుగురమే. కనుక మన పోటీ ఈడుమీద ఉన్న పోట్లగిత్తలాగా పరిగెత్తాలి అర్థమైందిగా నా భాష”
“అర్థమైంది దొరా”
“అర్థమైతే ఇంకేం? డ్రైవరు కారుని గెస్టుహౌస్ కి పోనివ్వు”
మంత్రిగారి ఆజ్ఞకి బద్దుడైన డ్రైవరు వెంటనే గెస్టుహౌస్ వేపుకి కారుని పోనివ్వసాగాడు.
కారువచ్చి గెస్టుహౌస్ ముందు ఆగేసరికి సాయంత్రం ఐదున్నర్ర అయింది.అప్పటికే సస్పెండు అయిన ఉద్యోగులు – ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ పార్టీలకి చెందిన నాయకులు చాలామంది వచ్చి ఉన్నారక్కడ.వారితోపాటుగా అధికారపార్టీకి చెందిన కార్యకర్తలు కూడా వందల సంఖ్యల్లో చేరారు.
కారు దిగుతూనే ఉద్యోగుల్ని గమనించాడు మంత్రి పశుపతి.
నినాదాలు మారుమ్రోగాయక్కడ.
సస్పెండుకి గురైన ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టాలని,
ఉద్యోగులని వేధిస్తున్న ప్రభుత్వ దుష్టచర్య నశించాలని,
మంత్రి పశుపతి డౌన్ డౌన్ అని….
ఉద్యోగుల నినాదాలు పెల్లుబికాయి.
అల్లరి చెలరేగింది.
అయినాకూడా అంతగా పట్టించుకోకుండా తనకు కేటాయించిన రూములోకి వెళ్ళిపోయాడు పశుపతి.
అతనలా చేసేసరికి ఇంకా కాస్త అధికమయ్యాయి నినాదాలు.
ఉద్యోగ సంఘాలకి చెందిన పలువురు నాయకులు విసురుగా మంత్రిగారి రూములోకి వెళ్లటానికి ప్రయత్నించారు.కానీ వాళ్ల ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు పోలీసులు.
అడ్డుకొని బలవంతంగా బయటకి నెట్టివేశారు.లాఠీచార్జ్ చేశారు.
“పోలీసు జులం నశించాలి…..
పోలీసుల చేత లాఠీఛార్జ్ చేయించిన మంత్రి పశుపతి డౌన్ డౌన్” అంటూ ఏక కంఠంతో గొంతెత్తి అరిచారు ఉద్యోగులు.
పశుపతి బయటకు రావాలి…..
సస్పెండ్ ఉత్తర్వుల్ని తక్షణం రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్న ఉద్యోగుల్ని ఓదార్చి సర్దిచెప్పటానికి ప్రయత్నాలు ప్రారంభించారు అధికారపార్టీకి చెందిన జిల్లా నాయకులు.అయినా కూడా వాళ్ళమాటల్ని లెక్కచేయలేదు ఉద్యోగులు.తమ ధోరణిని ఇంకాస్త అధికం చేశారు.
తమతో చర్చించటానికి మంత్రి పశుపతి సిద్ధం కావాలని..
విషయాన్ని చర్చించటానికి తమకి టైముని కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
పరిస్థితులు అదేవిధంగా కొనసాగితే వాతావరణం కలుషితమవుతుందన్న నగ్నసత్యాన్ని గ్రహించి వెంటనే స్పందించాడు అధికారపార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు.అతనితోపాటుగా పార్టీ జిల్లా సెక్రటరీ కూడా మంత్రిగారి రూములోకి వెళ్ళాడు.
వాళ్ళు వెళ్లిన పదినిమిషాలకే వెనక్కు తిరిగి వచ్చారు.
ఓ గంటలో మంత్రిగారు అపాయింట్మెంట్ ని కేటాయించినట్లుగా ఉద్యోగసంఘాల నాయకులకు చెప్పారు.
అప్పటివరకు ఎలాంటి గొడవలు చేయకుండా ఉండవలసిందిగా మంత్రిగారు కోరినట్లుగా ఉద్యోగసంఘాల నాయకులకు చెప్పారు.వాళ్ళ మాటలకి చల్లబడ్డారు ఉద్యోగులు.అందుకు అంగీకార సూచకంగా వెళ్ళి చెట్లక్రింద కూర్చున్నారు.
వారి పరిస్థితి ఆ విధంగావుంటే…..
అనేక మండలాలకి చెందిన పలువురు నాయకులు మంత్రిగారితో తమ తమ సమస్యల గురించి,ఉద్యోగుల వేధింపుల గురించి చెప్పుకొని సమస్యల పరిష్కారానికి మంత్రిగారి వద్దనుండి హామీని తీసుకున్నారు. విజయగర్వంతో ఎవరికివారే బయటకు రాసాగారు.ప్రతిపక్ష పార్టీలకి చెందిన నాయకులు కూడా వెళ్ళి తమకు కావలసిన పనులకి పర్మిషన్ ని తీసుకుని బయటకు వస్తున్నారు.ఉద్యోగుల సస్పెన్స్ విషయంలో ఎలాంటి వత్తిడికి లొంగకూడదని, గవర్నమెంట్ ఉప్పు తింటూ విధులకు న్యాయం చేకూర్చకుండా కాలయాపన చేస్తున్న ఉద్యోగుల పొగరు అణచటానికైనా ఇలాంటి సంఘటనలు జరిగి తీరవలసిందేనంటూ మంత్రిగార్కి కొన్ని సూచనలు చేసి తిరిగి బయటకి రావడమే కాకుండా బయటకి వస్తూనే ఉద్యోగసంఘాల నాయకుల్ని పక్కకు పిలిచి తాము మంత్రిగారి చర్యని ఖండించామని, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యని ఎండగట్టామని,తక్షణ సస్ పెన్షన్ ఉత్తర్వుల్ని రద్దుచేసుకోకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించినట్లుగా చెప్పుకున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.
వాళ్ళ సానుభూతికి సంతోషించిన ఉద్యోగ సంఘనాయకులు – అసలు జరిగింది వేరని గ్రహించలేకపోయారు.అల్పులుగానే సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఓ గంటలో అపాయింట్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రిగారు రెండుగంటలు గడిచిపోయినా తమని ఇంకా పిలవకుండా కూర్చున్నందుకు భయం చోటుచేసుకుంది ఉద్యోగుల గుండెల్లో.ఆవేశం పొంగుకొచ్చింది.తిరిగి కలకలం మొదలైందక్కడ.
అయినా కూడా ఇంకా ప్రజల్ని , నాయకుల్ని కలుసుకుని చర్చిస్తూనే ఉన్నారు మంత్రిగారు.
ఉద్యోగుల కదలికని గమనించి విషయాన్ని మంత్రి చెవిలో వేసాడు డి.ఎస్.పి.
మంత్రిగారికి ఇంకాస్త పట్టుదల పెరిగింది.కోపంతో ఉద్యోగ సంఘాల నాయకులకి కేటాయించిన టైంని పత్రికా ప్రతినిధులకు కేటాయించాడు.ఆ చర్య ఇరకాటంలో పడేసింది ఉద్యోగుల్ని. తిరిగి రెచ్చిపోతూ ఆవేశంతో నినాదాలు చేయటం ప్రారంభించారు.
వాళ్ళ నినాదాల్ని గురించి అంతగా పట్టించుకోకుండానే పత్రికా సమావేశాన్ని కొనసాగించాడు మంత్రి పశుపతి.
పలువురు ఉద్యోగులు విధులకి హాజరైనట్లుగా అటెండెన్సు రిజిస్టర్లో సంతకాలు చేసి ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి స్వంతపనులతో, కాలక్షేపకబుర్లతో, రాజకీయ చర్చలతో, వ్యాపారాల్ని కొనసాగిస్తుండడం వలన వారి మీద చర్య తీసుకోవటం జరిగిందని చెప్పాడు మంత్రిగారు.ప్రభుత్వ ఉద్యోగులై వుండి ప్రజలకి అందుబాటులో లేకుండా విధినిర్వహణకి న్యాయం చేకూర్చకుండా అక్రమంగా జీతాల్ని పొందుతున్న ఉద్యోగులకు ఈ చర్య కనువిప్పు కల్గిస్తుందన్న విశ్వాసాన్ని ప్రకటించాడు.
ఇక మున్ముందైనా తమతమ విధులకి సక్రమంగా హాజరై ప్రజలకి ఆందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి సహాయం అందించగల్గుతారని ఆశిస్తున్నాను.ప్రభుత్వానికి, ప్రజలకి నడుమ వారధులుగా నిలుస్తారని ఆశిస్తున్నాను.విధులకు హాజరు కాకుండా నిధుల్ని దుర్వినియోగం చేయాలని ఎవరు చూసినా సహించేదిలేదని,అటెండర్లయినా ఆఫీసర్లయినా ఎవరైనా సరే ఇలాంటి చర్యలకి పాల్పడితే ఎలాంటి పరిస్థితిలోనూ ప్రభుత్వం వారిని క్షమించదు, ఈ రోజు సస్పెండైన వారినుండి సరైన సంజాయిషీ వస్తే ఆ సంజాయిషిని పరిశీలించి, నిజానిజాల్ని నిగ్గుతేల్చుకున్న తరువాతనే క్షమాబిక్ష పెట్టడం జరుగుతుందని అప్పటివరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మంత్రి పశుపతి వెల్లడించారు.
ఉద్యోగ సంఘనాయకులు మౌనంగా ఉండి ప్రశాంత వాతావరణంలో చర్చలకు సిద్దపడి వుంటే తను తప్పకుండ వాళ్ళతో చర్చలు జరిపి వుండేవాడినని అలా ప్రవర్తించినందుకు విచారిస్తున్నామని,ప్రజాప్రతినిధినని కూడా గౌరవించకుండా అవమానపరిచే విధంగా నినాదాలుచేస్తూ అల్లర్లను సృష్టించే ప్రయత్నంలో ఉన్న ఆయా ఉద్యోగసంఘాల గుర్తింపుని రద్దు చేయటానికి కూడా ప్రభుత్వం వెనుకాడదని ఒక ప్రశ్నకి సమాధానంగా శ్రీ పశుపతి తెలియచేసారు.
అయితే ఉద్యోగ సంఘనాయకులతో సంప్రదింపులు జరపరా “ఈ రోజు సస్పెండు కి గురైన ఉద్యోగులకి క్షమాభిక్ష పెట్టరా” అంటూ ఒక విలేఖరి ప్రశ్నించగా అందుకు స్పందిస్తూ…..
వాళ్ళతో సంప్రదింపులకు దిగి టైంని వేస్ట్ చేసుకోవటం ఇష్టంలేదు నాకు.ఇక సస్పెండు కి గురయిన ఉద్యోగులు తమ తప్పుని గుర్తించగల్గిననాడు ఆలోచిస్తుంది ప్రభుత్వం” అన్నాడు పశుపతి.
“వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే?”
“ఆశ్రయించనివ్వండి.విధులకి న్యాయాన్ని చేకూర్చకుండా అటెండెన్సు రిజిస్టర్లో విధులకి హాజరైనట్లుగా సంతకాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టుతున్న ఉద్యోగులని కూడా తన పరిగణలోకి తీసుకుంటుంది న్యాయస్థానం.”
“అయితే… ఇలా ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు విధులకి హాజరు కాకుండా ప్రభుత్వ నిధుల్ని కాజేస్తూ సస్పెండుకి గురయ్యారో వివరిస్తారా?”
“వైనాట్….తప్పకుండా వివరిస్తాను.రాయలసీమలో 120 మంది.ఆంధ్రాలో 280 మంది.తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వరకు 380 మంది.విధులకి హాజరు కాకుండ ప్రభుత్వ నిధుల్ని దుర్వినియాగం చేసినందుకుగాను సస్పెండు అయ్యారు.”
టెలిగ్రామ్ ఛానల్ లో join అవ్వండి, సెక్స్ స్టోరీస్ చదువుతూ మొడ్డ కొట్టుకుంటూ enjoy చేయండి
https://t.me/allQandA!
Join Our Deals Channel!
Get hot offers, discounts & daily deals on WhatsApp and Telegram!